TG: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు TGSRTC శుభవార్త చెప్పింది. ట్రాఫిక్ ఫ్రీగా సిటీ దాటేందుకు పుష్పక్ ఏసీ ఫీడర్ అనే కొత్త సర్వీసుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ – బెంగళూరు సర్వీసులకు రిజర్వేషన్ టికెట్ బుక్ చేసుకునే సమయంలో శంషాబాద్ (Opp. RGIA Traffic P.S.) ను బోర్డింగ్ పాయింట్గా ఎంపిక చేసుకుని, సాయంత్రం 6.00 గంటల తర్వాత బయలుదేరే ప్రయాణికులకు మాత్రమే ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం లభిస్తుంది.