కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది. దీని ద్వారా ఇకపై 5 నుంచి 8 తరగతుల విద్యార్థులను ఫెయిల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ విధానాన్ని రద్దు చేయడంతో 5 నుంచి 8 తరగతుల విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థులకు 2 నెలల వ్యవధిలో మరోసారి పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది.