TG: కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించి విచారణ నివేదికను గురువారం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించింది. నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జాకు నివేదిక అందజేసింది. ఆయన సీఎస్కు ఈ నివేదికను అందజేయనున్నారు. 2024 మార్చి 14న కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి కమిషన్ విచారణ జరిపింది. మొత్తంగా 115 మందిని విచారణ చేసి సాక్ష్యాలు నమోదు చేసింది.