సొంతిల్లు లేని పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకాన్ని 2029 వరకు పొడిగించింది. ఈ పథకం కింద ఇంటి నిర్మాణానికి కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుంది. అర్హత కలిగినవారు, రేషన్ కార్డు కలిగి, తక్కువ ఆదాయ వర్గంలో ఉన్నవారు ఆన్లైన్లో pmaymis.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు అర్హతను పరిశీలించి, అర్హులైన వారిని లబ్ధిదారుల జాబితాలో చేర్చి నగదు జమ చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని, ఏపీ ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్నాయి.