భారత మహిళా క్రికెటర్లకు అరుదైన గౌరవం దక్కనుంది. విశాఖపట్నం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలోని రెండు స్టాండ్లకు మిథాలీ రాజ్, రవి కల్పన పేర్లు పెట్టాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. అక్టోబర్ 12న భారత్-ఆస్ట్రేలియా మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్కు ముందు స్టాండ్లకు పేర్లు పెట్టనున్నారు.