కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్. మోదీ ప్రభుత్వం 8వ వేతన కమిషన్కు ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజన్ దేశాయ్ ఈ వేతన కమిషన్కు చైర్పర్సన్గా వ్యవహరించనున్నారు. 7వ వేతన సవరణ కాలం 2026తో ముగియనున్న నేపథ్యంలో కొత్త వేతన సవరణ కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. సుమారు 50 లక్షల ఉద్యోగులు, 65 లక్షల పింఛనుదారుల జీతాలు, భత్యాల పెంపు ఈ కమిషన్ ఆధారంగానే నిర్ణయించబడతాయి.