ఐపీఎల్లో ఉత్కంఠభరిత పోరులో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలిచి పంజాబ్కు ఈ సీజన్లో తొలి ఓటమి రుచి చూపించింది. ఇక ఈ సీజన్లో యువ ఆటగాడు సూర్యవంశీ సంచలన ఫామ్ కొనసాగిస్తూ మళ్లీ ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో నిలిచాడు. 400 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అతని తర్వాత అభిషేక్ శర్మ, KL రాహుల్, విరాట్ కోహ్లీ తదితరులు ఉన్నారు.