వికారాబాద్ జిల్లాలోని ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు తాగునీరు, టాయిలెట్లు, లైట్లు, ఫ్యాన్లు, పెయింటింగ్ వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండేలా చూడాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లాలోని ఎంపీడీఓలు, కళాశాల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.