కాటారం సబ్ డివిజన్ డీఎస్పీ సూర్యనారాయణ పర్యవేక్షణలో, రోడ్డు ప్రమాదాలను నివారించి, భద్రతను పెంచేందుకు కమలాపూర్ క్రాస్ నుండి కాళేశ్వరం వరకు ఉన్న రహదారిపై ప్రమాదకర ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ బోర్డుల ద్వారా వాహనదారులకు ముందస్తు హెచ్చరికలు అందించి, ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యమని ఎస్సై తెలిపారు.