భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా జిల్లాలో నేర నియంత్రణ, పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా నిర్వహించబడుతుందని, సీసీ కెమెరాల మానిటరింగ్ కూడా ఇక్కడి నుంచే జరుగుతుందని తెలిపారు. టెక్నాలజీ వినియోగంతో పోలీసింగ్ను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన భద్రత అందించడమే లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు.