మేడారం జాతర సందర్భంగా భక్తులకు విద్యుత్ పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, విద్యుత్ వెలుగులతో మేడారాన్ని తీర్చిదిద్దామని ఎన్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. చీఫ్ ఇంజనీర్ల పర్యవేక్షణలో 4 సూపరిండెంట్ ఇంజనీర్లు, 7 డివిజన్ ఇంజనీర్లు, 30 మంది అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు, 500 మంది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులు 3 బ్యాచ్లలో విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.