కొమ్మాల జాతర సందర్భంగా ట్రాఫిక్ మల్లింపు

గేసుకొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా, వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. ఈ ఆంక్షలు మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం రాత్రి వరకు అమల్లో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్