హనుమకొండ జిల్లా ఎన్నికల పరిశీలకులు శివకుమార్ నాయుడు, ధర్మసాగర్ మండలం ఎల్కుర్తి, పెద్ద పెండ్యాల క్లస్టర్లలోని గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను, గత రెండు రోజుల్లో స్వీకరించిన నామినేషన్ల సంఖ్యను ఆయన అడిగి తెలుసుకున్నారు.