ఫిర్యాదు నేపధ్యంలో స్పందించి క్షేత్రస్థాయి సందర్శన

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, 56వ డివిజన్ గాయత్రి కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్ సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. గాయత్రి కాలనీ నివాసితులు మౌలిక సదుపాయాల లేమితో ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్, సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ప్రాథమిక వసతుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్