నగర పోలీస్ కమిషనర్ (సీపీ) అధికారులు అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వర్తించాలని స్పష్టం చేశారు. సీసీఎస్, టాస్క్ఫోర్స్ విభాగాల్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐలు దేవేందర్, హరికృష్ణ సీపీని కలిసి మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, పోలీస్ శాఖ కీర్తిప్రతిష్టలు అధికారుల పనితీరుపైనే ఆధారపడి ఉంటాయని, విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.