వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిపాలన విభాగం, పదవీ విరమణ చేస్తున్న పోలీసు అధికారులకు ఘనంగా సన్మానం చేసింది. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి రవి, ఇతర అధికారులు, పదవీ విరమణ చేసిన ఎస్సై నజీర్, ఆర్. ఎస్సై రవికుమార్, ఏ. ఆర్. ఎస్సైలు రమేష్, మల్లారెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు నారాయణ, అశోక్ లను పూలమాలలతో సత్కరించారు. సుదీర్ఘకాలం పాటు విధులు నిర్వహించిన వీరికి ఈ సన్మానం జరిగింది.