హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డ్రైవర్గా సుదీర్ఘకాలం పనిచేసిన కప్పల సాంబయ్యకు ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా, పదవీ విరమణ చేసిన సాంబయ్య, ఆయన సతీమణి సుభద్రలను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్ ఎన్. రవి, ఇతర అధికారులు శాలువాలు, పూలమాలలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది.