వర్ధన్నపేట ఇళ్లంద గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పోలీస్ అధికారులు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ శ్రీనివాస్ రావు, ఎస్సై సాయి బాబు మాట్లాడుతూ, మూడో కన్నుగా పిలవబడే సీసీ కెమెరాల వ్యవస్థ నేరాల అదుపునకు, దొంగతనాల నివారణకు ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. ప్రజలందరూ సహకరించి, నేర రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు.