TG: శాంతిభద్రతల్లో సమస్య రాకముందే అప్రమత్తంగా ఉండటం మంచిదని రాష్ట్ర నూతన డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. శుక్రవారం బాధ్యతల స్వీకరణ సందర్భంగా మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు అహర్నిశలు కృషి చేస్తామని, ప్రభుత్వ ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరేలా పనిచేస్తామని అన్నారు. నేరాల దర్యాప్తులో తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఉత్తమ పనితీరు కనబరిచారని ఆయన ప్రశంసించారు.