మహిళల అంతర్జాతీయ క్రికెట్లో భారత క్రికెటర్ దీప్తిశర్మ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆస్ట్రేలియాపై ఒక వికెట్ తీయడం ద్వారా, ఆమె 356 అంతర్జాతీయ వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన మహిళా బౌలర్గా నిలిచింది. ఈ క్రమంలో, ఆమె భారత క్రికెటర్ ఝులన్ గోస్వామి (355 వికెట్లు) రికార్డును అధిగమించింది. మరోవైపు, టీ20ల్లో అత్యధిక సిక్స్లు (89) కొట్టిన భారత మహిళా క్రికెటర్గా హర్మన్ప్రీత్ కౌర్ నిలిచింది, స్మృతి మంధాన (88 సిక్స్లు) రికార్డును బద్దలు కొట్టింది.