ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి భారీ షాక్ తగిలింది. కూటమి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. విజయనగరం పట్టణం 3వ డివిజన్లో 500 కుటుంబాలు, 37వ డివిజన్లో 400 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారికి పూసపాటి అదితి విజయలక్ష్మి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.