
రాయచోటి: జిల్లా అభివృద్ధికి సమన్వయంతో పని చేద్దాం
నూతన సంవత్సరంలో జిల్లా అభివృద్ధికి సమన్వయంతో పని చేద్దామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. బుధవారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రాయచోటి లోని క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు మంత్రికి పూలబొకేలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా పని చేద్దామన్నారు.