
రాయచోటిలో గ్యాంగ్ వార్ కు పాల్పడిన నిందితులతో కవాతు
రాయచోటిలో గ్యాంగ్ వార్ కు పాల్పడిన నిందితులతో శుక్రవారం పోలీసులు కవాతు నిర్వహించారు. ఎవరైనా గ్యాంగ్ నిర్వహించడం, గంజాయి వాడకం, బెట్టింగ్, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. రౌడీ షీటర్ గా నమోదు చేయడం, పలుమార్లు కేసులు నమోదు అయితే జిల్లా బహిష్కరణ కూడా ఉంటుందని అన్నారు. రాయచోటిలో రౌడీ గ్యాంగ్ అనేది ఉండకూడదని తెలిపారు.