
వీరబల్లి: మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
వీరబల్లి: మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు తెలియజేశారు. సోమవారం వీరబల్లి మండలం ఓదివీడు కస్పా నందు ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఇఫ్తార్ విందు కోసం నిధులు విడుదల చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు.