చౌడేపల్లి మండలంలో పర్యటించిన ఎంపీ, ఎమ్మెల్యేలు

70చూసినవారు
మాజీ మంత్రి, పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఆదివారం నియోజకవర్గానికి చెందిన చౌడేపల్లి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారికి వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పలువురు ప్రజలు వారిని కలిసి వినతులు సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్