మంత్రి ఆదిమూలపు సురేష్ సతీమణి విజయలక్ష్మిపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఐఆర్ఎస్ ఆఫీసర్ అయిన విజయలక్ష్మి వైసీపీ అభ్యర్థుల తరఫున నామినేషన్ వేయించడం, దగ్గరుండి అన్నీ పర్యవేక్షించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నెల 19న విజయలక్ష్మి తన భర్త ఆదిమూలపు సురేష్ తరఫున వైసీపీ నాయకులతో నామినేషన్ వేయించారని, ఇది అధికార దుర్వినియోగమేనని ఆరోపించారు.