దేవాలయాలకు వెళ్లిన సందర్భంలో ఫలం, పత్రం, పుష్పం సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే, కేరళలోని ఆలయాల్లో దేవతామూర్తులకు సమర్పించే నైవేధ్యంతో పాటు భక్తులకు ఇచ్చే ప్రసాదంలో అరలి పుష్పాలను నిషేధించారు. అరలి పువ్వులకు బదులుగా తులసీ ఆకులు, తేచి (జంగిల్ జెరేనియం) మందార నైవేద్యంగా సమర్పించాలని సూచించారు. అలప్పుజ జిల్లాలో 24 ఏళ్ల మహిళ ప్రమాదవశాత్తు అరలి (ఒలియాండర్) ఆకులను నమిలి మింగడంతో ఆమె మృతి చెందింది.