ఓబులేసునిపల్లెలో టీడీపీలోకి చేరికలు
దుర్గి మండలం ఓబులేసునిపల్లె గ్రామంలో వైసీపీకి చెందిన పలువురు కార్యకర్తలు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి సమక్షంలో శనివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వైసీపీ కార్యకర్తలకు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.