AP: శ్రీకాకుళం జిల్లా పలాసలో ఫలక్నుమా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నుంచి బోగీలు విడిపోయాయి. సికింద్రాబాద్ నుంచి హావ్డా వైపు వెళ్తుండగా పలాస పట్టణ శివారులో ఘటన జరిగింది. దీంతో సుమారు గంట నుంచి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. విడిపోయిన బోగీలను రైలుకు సిబ్బంది అమరుస్తున్నారు. కాగా బోగీలు ఎందుకు విడిపోయాయి అనేది తెలియాల్సి ఉంది.