ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కేసు నమోదు
యడ్లపాడు మండలం చెంఘీజ్ ఖాన్ పేటలో ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్లు ఆదివారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో కొత్తసొలస వద్ద టీడీపీ రంగులతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఫొటోలతో ఉన్న వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. సమాచారం అందుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ అక్కడకు వచ్చి వాటర్ బాటిల్స్ స్వాధీనం చేసుకొని కోడ్ ఉల్లంఘించిన ప్రసాద్ పై ఎస్ఐ జె. శామ్యూల్ రాజీవ్ కుమార్ కేసు నమోదు చేశారు.