
పాక్కు రహస్యాలు చేరవేస్తున్న ఇద్దరు అరెస్ట్
పాకిస్థాన్కు భారత సైన్యానికి సంబంధించిన కీలక రహస్యాలను చేరవేస్తున్నారన్న ఆరోపణలపై పంజాబ్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. ఢిల్లీలోని పాక్ హై కమిషన్ కార్యాలయ అధికారికి ఈ రహస్య సమాచారం అందించారని పోలీసులు వెల్లడించారు. ఈ ఇద్దరూ మన సైన్యానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాక్కు పంపినట్లు తమ దర్యాప్తులో బయటపడిందని డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు.