BREAKING: సీరియల్ నటుడు ఆత్మహత్య
హైదరాబాద్లోని మణికొండలో సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకుని ఇవాళ కన్నుమూశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఆయన గాయపడినట్లు తెలుస్తోంది. చందుకు భార్య శిల్ప, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సీరియల్ నటి పవిత్ర జయరాం మరణించిన విషయం తెలిసిందే. పవిత్ర జయరాంతో కూడా పెళ్లయినట్లు వార్తలు వచ్చాయి. కాగా రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం వంటి సీరియల్స్ లోనూ ఆయన నటించారు.