పిఠాపురంలో పవన్‌ పర్యటన.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు

82చూసినవారు
పిఠాపురంలో పవన్‌ పర్యటన.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు
కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా ఆదివారం పలు ఆలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాదగయక్షేత్రంతో పాటు కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీ దేవి, దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత శ్రీపాద శ్రీ వల్లభుడికి పూజలు చేశారు. పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.