సికింద్రాబాద్ - విశాఖ వందేభారత్ సమయం మార్పు..!
వందేభారత్ రైళ్లకు తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ పెరుగుతోంది. అదే సమయంలో ప్రయాణీకుల సహనానికి పరీక్షగా మారుతోంది.ఇక...సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయ పాలనలో సమస్యలు ఎదురవుతున్నాయి. తాజాగా ఇదే రైలుకు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేసారు.సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు (20834) ఐదు గంటల ఆలస్యంగా బయల్దేరనుంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరాల్సిన ఈ రైలును రాత్రి 8 గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.