రక్షాబంధన్ వేడుకలు
విశాఖ పర్యటనలో ఉన్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి జె. కె. మహేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి రక్షాబంధన్ వేడుకను జరుపుకున్నారు. భీమిలి వద్ద కుటుంబ సభ్యులందరూ సోమవారం సందడిగా గడిపారు. ఆయనకు తూర్పుగోదావరి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జి. సునీత రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యుల్లో అన్నాచెల్లెళ్లు రాఖీ పండుగను ఉత్సాహంగా నిర్వహించుకున్నారు.