24 గంటల్లో ల్యాండ్ టైటిలింగ్ను రద్దు చేస్తా: బాబు
మన ఆస్తులు అమ్ముకోవాలన్నా సీఎం జగన్ అనుమతి తీసుకోవాల్సి వస్తుందని చంద్రబాబు మండిపడ్డారు. "రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన 24 గంటల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేస్తా. జగన్ అధికారంలోకి వస్తే అమరావతి, పోలవరం నిర్మాణాలు ఆగిపోతాయి. ఈ ఐదేళ్లు ఎవరైనా బాగుపడ్డారా? సొంత చెల్లి చీర రంగు గురించి మాట్లాడే అన్నయ్య ఎవరైనా ఉంటారా?" అని సీతంపేట సభలో చంద్రబాబు ధ్వజమెత్తారు.