ఘోరం..ఆర్మీ ఉద్యోగి స్పాట్ డెడ్
అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెదగోగాడ గెడ్డలో పడి ఆర్మీ ఉద్యోగి మృతి చెందాడు. ఎస్సై జి.నారాయణరావు తెలిపిన వివరాల ప్రకారం..పి. భీమవరంకి చెందిన పడాల వరహాలు ఆర్మీలో పనిచేస్తున్నారు. సెలవుపై స్వగ్రామం వచ్చిన వరహాలు దేవరాపల్లి మం. వాకపల్లిలో అత్తవారింటికి బయలుదేరాడు. పెదగోగాడ సమీపంలో బైక్ అదుపుతప్పడంతో రోడ్డు పక్కన ఉన్న గెడ్డలో పడిపోయాడు. ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు.