కేంద్ర బడ్జెట్‌లో ఉత్తరాంధ్రకు అన్యాయం

77చూసినవారు
కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోఆంధ్ర రాష్ట్రానికి, వెనుకబడిన ఉత్తరాంధ్రకు తీవ్ర ద్రోహం చేసిందని సిఐటియు అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో పరవాడ సినిమా హాల్ జంక్షన్ వద్ద గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఊసే లేదని, రైల్వే జోన్‌, తదితర హామీలు బడ్జెట్‌లో చోటు చేసుకోలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్