పేదలకు మరింతగా మంచి చేస్తాం
ఆచంట నియోజకవర్గం వైస్సార్సీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు శనివారం పెనుమంట్ర మండలం సత్యవరం గ్రామం లో ఎన్నికల శంఖరావ ప్రచారయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను దాదాపు పూర్తిచేశామని మరోసారి అవకాశమిస్తే మరింత మంచి చేస్తామని వెల్లడించారు. కార్యక్రమం లో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.