అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే VR. ఎలీజా వైసీపీకి గుడ్బై చెప్పి, కాంగ్రెస్ గూటికి చేరారు. హైదరాబాద్లోని లోటస్పాండ్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఎలీజాకు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. కాగా, ఇవాళ ఉదయమే తిరుపతి జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.