టీడీపీపై వైసీపీ విష ప్రచారం: అచ్చెన్నాయుడు

71చూసినవారు
టీడీపీపై వైసీపీ విష ప్రచారం: అచ్చెన్నాయుడు
పింఛన్లు పంపిణీ చేయకుండా టీడీపీ అడ్డుపడుతోందంటూ వైసీపీ విష ప్రచారం చేస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరావు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైసీపీ నేతలు ఎన్నికలు ఎన్నికల సంఘం ఆదేశాలను వక్రీకరించి వాలంటీర్లకు వాయిస్ మెసేజ్‌లు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం వల్లే పింఛన్ పంపిణీ నిలిపివేసినట్లు పెన్షన్‌దారులకు చెప్పాలని ఆదేశాలిచ్చారని మండిపడ్డారు.