నేపాల్‌లో భారీ వరదల కారణంగా 112 మంది మృతి (వీడియో)

57చూసినవారు
నేపాల్‌లో వరదలకు ఇప్పటివరకు 112 మంది మృతి చెందినట్లు ఆ దేశంలోని సాయుధ దళాలు తెలిపాయి. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్లు పేర్కొన్నాయి. నేపాల్‌లో గత కొన్ని రోజులుగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగిపోయాయి. దీంతో అక్కడి జనజీవనం స్తంభించింది. వరద బాధితులను సహాయక దళాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ వరదల ప్రభావం బిహార్‌పై పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్