ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

54చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
యాదాద్రి భువనగిరి(D) చౌటుప్పల్‌(M) ఎల్లంబావి వద్ద HYD-విజయవాడ NHపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తుపల్లి నుంచి HYD వస్తున్న ట్రావెల్ బస్సు బ్రేక్‌డౌన్‌ కావడంతో రోడ్డు పక్కన నిలిపారు. ఈ క్రమంలో ఓ కంటెయినర్‌ లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పాల సతీశ్‌కుమార్‌రెడ్డి(46), ఎజ్జు రవీంద్రతేజ(25) అక్కడికక్కడే మృతిచెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, బస్సు కిందకు వెళ్లి పరిశీలిస్తున్న ఓ వ్యక్తి నడుముపైకి టైరు ఎక్కడంతో బయటకు రాలేక నొప్పితో విలవిల్లాడాడు.

సంబంధిత పోస్ట్