40 మంది జవాన్లతో వెళ్తున్న బస్సు బోల్తా

85చూసినవారు
40 మంది జవాన్లతో వెళ్తున్న బస్సు బోల్తా
ఛత్తీస్‌గఢ్ బస్తర్ జిల్లాలో పెనుప్రమాదం తప్పింది. కోడెనార్ పీఎస్ పరిధిలో భద్రతా సిబ్బందితో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దిమరాపాల్ ఆస్పత్రికి తరలించారు. జగ్దల్‌పూర్ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల విధుల నుంచి సైనికులు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ట్యాగ్స్ :