జొమాటో కస్టమర్లకు భారీ షాక్‌

73చూసినవారు
జొమాటో కస్టమర్లకు భారీ షాక్‌
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ అయిన జోమాటో తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఫుడ్​ డెలివరీపై ప్లాట్​ఫామ్ ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇకపై ప్రతి ఆర్డర్​పై రూ.10 చొప్పున వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఇంతకుముందు ఈ ప్లాట్‌ఫామ్‌ ఫీజు రూ.7 ఉండగా ఇప్పుడు దాన్ని రూ.10 పెంచింది. పండుగ సీజన్‌ సందర్భంగా కస్టమర్లకు తమ సర్వీసుల్ని విజయవంతంగా అందించేందుకు వీలుగా ప్లాట్‌ఫామ్‌ ఫీజును పెంచినట్లు యాప్‌లో పేర్కొంది.

సంబంధిత పోస్ట్