రేణిగుంట ఎఫ్సీఐ గోదాం వద్ద ప్రచార సామగ్రి డంప్ బయటపడిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ ప్రచార డంప్లు బట్టబయలైనా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. 4 డంప్లు సాక్ష్యాధారాలతో నిరూపించినా ఎందుకు స్పందించట్లేదని మండిపడ్డారు. చెవిరెడ్డి, మోహిత్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని, వారిద్దరినీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.