విజయవాడలోని పాస్పోర్టు సేవా కేంద్రంలో ఈరోజు సేవలకు అంతరాయం కలిగింది. సాంకేతిక సమస్య వల్ల సర్వర్ పనిచేయలేదని అధికారులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఈ సమస్య తలెత్తినట్టు తెలిపారు. ఈ కారణంగా పలువురు అభ్యర్థులు ఇబ్బందులుపడ్డారు. సాధ్యమైనంత వరకు ఈరోజు స్లాట్లు పూర్తి చేస్తామని పాస్పోర్టు ప్రాంతీయ అధికారి తెలిపారు. మిగిలిన వారికి మరో రోజు స్లాట్లు ఇస్తామని, అభ్యర్థులు ఆందోళన చెందవద్దని అన్నారు.