దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 159 పాయింట్ల లాభంతో 73,898 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 22,412 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.37 వద్ద ప్రారంభమైంది. భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, NTPC, నెస్లే ఇండియా, TCS, HCL టెక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, పలు షేర్లు లాభాల్లో ఉన్నాయి.