ప్రధాని
మోదీ నిజాయితీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పటికైనా అదానీపై దర్యాప్తునకు ఆదేశించండి అని రాహుల్ అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అదాని గ్రూప్పై దర్యాప్తు చేయిస్తామన్నారు. మార్కెట్ విలువ కంటే ఎక్కువ ధరకు బొగ్గును
అదానీ దిగుమతి చేసుకున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని చూపిస్తూ..
అదానీ ప్రజల నుంచి నేరుగా దోచుకుంటున్నారని ఆరోపించారు.