తల్లిదండ్రులు ఓటు వేస్తే పిల్లలకు అదనపు మార్కులు

54చూసినవారు
తల్లిదండ్రులు ఓటు వేస్తే పిల్లలకు అదనపు మార్కులు
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో స్కూళ్లు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తమ స్కూళ్లలో చదివే పిల్లల తల్లిదండ్రులు ఓటు వేస్తే విద్యార్థులకు ఒక్కొక్కరికి 10 మార్కులు అదనంగా వేస్తామని సెయింట్ జోసెఫ్ విద్యాసంస్థల యాజమాన్యం తెలిపింది. అలాగే తమ స్కూళ్లలో పనిచేసే సిబ్బంది ఓటు వేస్తే వారికి ఒక్క రోజు జీతం అదనంగా ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈనెల 21న అక్కడ పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్