సినీ నిర్మాత నళినీ రంజన్ రావు కన్నుమూత

85చూసినవారు
సినీ నిర్మాత నళినీ రంజన్ రావు కన్నుమూత
సినీ నిర్మాత దామిశెట్టి నళినీ రంజన్‌ రావు (82) కన్నుమూశారు. ఆయన ఏపీలోని కోనసీమ జిల్లా తోటపేట గ్రామంలో జన్మించారు. రంజన్‌ రావుకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన నిర్మాత మిద్దె రామారావు, అంగర సత్యంలతో కలిపి రాజ్యలక్ష్మి ఆర్ట్స్‌ బ్యానర్‌ పై పల్లెటూరి మొనగాడు, పదహారేళ్ళ వయసు చిత్రాలను నిర్మించారు. ఆయన మృతికి ఇండస్ట్రీ ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు నివాళులర్పించారు.